Monday, April 29, 2024

బెంగాల్ హింసకు నిరసనగా బీజీపీ జిల్లా అధ్యక్షుని ధర్నా

గుంటూరు – పశ్చిమ బెంగాల్ లో బీజీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ బుధవారం తెనాలి అయితానగర్ లో ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గ కేంద్రాలలో కొవొడ్ నిబంధనలకు అనుగుణంగా బీజీపీ నాయకులు మధ్యాహ్నం.12 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని హింసాకాండ జరుగుతున్నదని ఆరోపించారు. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యంలో మంచివి కావని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement