Saturday, May 4, 2024

గుంటూరు రూరల్ మండలం సర్వసభ్య సమావేశం

గుంటూరు రూరల్ ఫిబ్రవరి 17 (ప్రభా న్యూస్ ) గుంటూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు రూరల్ జడ్పిటిసి తుమ్మల సుబ్బారావు మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాలలో స్త్రీ నిధుల దుర్వినియోగంపై ఏపీఎంను వివరణ అడగగా దానికి సంబంధించి పూర్తి వివరణ నాకు కావాలని ఏపీఎంను ఆదేశించడం జరిగింది. రూరల్ మండలంలోని వివిధ శాఖ అధికారులు వారు చేస్తున్న పనితీరు గురించి ప్రతి అధికారిని ఎంపీడీవో వివరణ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు మండల జడ్పిటిసి సభ్యులు తుమ్మల సుబ్బారావు , మండల అధ్యక్షురాలు, పులగం దివ్య శ్రీనివాస్ రెడ్డి , ఎంపీడీవో శోభారాణి , ఈవోపీఆర్టి శ్రీనివాస్ రావు, గొల్లవారిపాలెం సర్పంచ్ నల్ల మేకల అప్పమ్మ మాధవరావు, చల్లా వారి పాలెం సర్పంచ్ ఆరుదల సాంబశివరావు, జొన్నలగడ్డ సర్పంచ్ మబ్బు శిరీష సుధాకర్, జగన్మోహన్ రెడ్డి, అధికారులు సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొని మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement