Friday, April 26, 2024

దోపిడీ దొంగల హల్‌చల్.. బైక్ ఆపి రూ.25వేలు చోరీ..

దారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి నగదు దొంగిలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం హైవేపై బైక్‌పై వెళ్తున్న జోగ్య అనే వ్యక్తిని అడ్డగించారు. అతడి దగ్గర ఉన్న రూ.25 వేలు, సెల్‌ఫోన్‌ దుండగులు ఎత్తుకెళ్లారు. ఎ.కొండూరు పీఎస్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement