Friday, March 29, 2024

గుడిసెలో అగ్నిప్ర‌మాదం.. ఐదుగురు స‌జీవ‌ద‌హ‌నం

ఓ గుడిసెలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ దేహత్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్మౌ బంజారదేరా గ్రామంలో చోటుచేసుకుంది. బంజారదేరా గ్రామంలో సతీష్ కుమార్ తన భార్య కాజల్, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే వీరంతా ఆదివారం రాత్రి గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఏమయిందో తెలియదు గానీ ఆ గుడిసెకు ఒక్క సారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులంతా సజీవంగానే దహనం అయ్యారు.

స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు చాలా కష్టపడ్డారు. అయినా ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయారు. ఈ అగ్నిప్రమాదంలో సతీష్ తల్లికి కూడా గాయాలు అయ్యాయి. అయితే ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పైకప్పుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement