Thursday, May 2, 2024

వైభవంగా ముగిసిన వాసవి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు

దాచేపల్లి, :నగర పంచాయతీ దాచేపల్లి పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం మూడో వార్షికోత్సవం సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న పూజా కార్యక్రమాలు సోమవారం తో వైభవంగా ముగిసాయి. ఆలయ ఉత్సవ చైర్మన్ మాశెట్టి బుజ్జి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి చండీ హోమం నిర్వహించారు. ఛంఢీ హోమం సందర్భంగా అమ్మవారు దర్శన మిస్తారనీ భక్తుల నమ్మకం. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి పూజలు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కనిగిరి బాబురావు, పసుమర్తి శ్రీనివాసరావు, దాచేపల్లి సురేష్, కనమర్ల పూడి గోపి, దేవరశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement