Sunday, April 28, 2024

జోడో యాత్రకు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలి : సాంబశివుడు

తెనాలి రూరల్, ఫిబ్రవరి 19, (ప్రభ న్యూస్): పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము నిర్వహిస్తున్న జోడో యాత్రకు సంఘీభావం ప్రకటించాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోపల్లె గ్రామంలో ఆయన జూడోయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులు పేద వర్గాలకు రక్షణగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కుటుంబ నేతలే పాలకవర్గంలో ఉండి కూడా దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లను మరువ రాదన్నారు. సత్యాన్ని ప్రజలు గ్రహించాలని, ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీని ఎన్నికలు లేకపోయినా ఆదరించాలనే తన పిలుపుకు ప్రతి ఒక్కరూ తమ స్పందన కనపరచాలని కోరారు. ఆయన వెంట,తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి భుల్లియ్య, తెనాలి పట్టణ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్, కొల్లిపర మండల ప్రెసిడెంట్ యస్. రామకృష్ణ, పి.శివకుమార్.టి. శివన్నారాయణ, పి. పృద్విరాజ్, పి. స్టీవెన్ బాబు ఎస్ కె. మాబు, కె. కోటేశ్వరరావు ఏ. కృష్ణ యస్.సుబ్బారావు. రామప్ప . సాంబశివరావు, కె.వీరాస్వామి, మల్లికార్జున కె. వెన్నెల,పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement