Monday, May 6, 2024

వనదుర్గ దేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

పెదకాకాని , ఫిబ్రవరి 17 (ప్రభ న్యూస్)మహాశివరాత్రికి పెదకాకాని మల్లేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య అన్నారు. శుక్రవారం మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవంలో భాగంగా వన దుర్గ దేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు . గ్రామపురవీధుల్లో నరనంది వాహనంపై గ్రామోత్సవం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఏసీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శనివారం వాహన పూజలు నిలుపుదల చేసినట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement