Saturday, May 4, 2024

చిత్తూరు, తూర్పులో పెరుగుతున్న క‌రోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 175 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి… దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో న‌మోదైన కేసుల సంఖ్య 891563కు చేరింది.. చిత్తూరులో 40, తూర్పు గోదావ‌రిలో 31, కృష్ణాలో 24, విశాఖ జిల్లాలో 20 కేసులు కొత్త‌గా న‌మోదుకావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.. ఇక కరోనా వల్ల అనంతపూర్‌, చిత్తూర్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7182కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1268 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 883113 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement