Thursday, May 2, 2024

AP: మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి ఉషాశ్రీచరణ్

అనంతపురం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి ఉషాశ్రీచరణ్ తెలిపారు. కళ్యాణదుర్గంలో 50 పడకల నూతన అదనపు హాస్పిటల్ భవనాలను బుధవారం మంత్రి ఉషాశ్రీచరణ్ ఫ్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే సీఎం జగనన్న ధ్యేయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement