Tuesday, May 7, 2024

TS: పెద్దూరులో గీత కార్మికుడి బలవన్మరణం

సిరిసిల్ల, సెప్టెంబర్ 6 (ప్రభన్యూస్) : ఆర్థిక ఇబ్బందులకు తోడు స్థలం విషయంలో మధ్యవర్తిత్వం వహించిన పాపానికి గీత కార్మికుడి ప్రాణాలు బలితీసుకుంది. ఇవాళ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు గ్రామంలో బెజ్జారపు రమేష్ (42) ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన పెద్దూరు గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రమేష్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టు తెలిసింది. వృత్తిపరమైన సమస్యలతో పాటు ఇటీవల ఒక స్థలం విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించి ఇబ్బందుల పాలవుతున్నట్టు తెలిసింది.

అయితే తన సమస్యలను స్నేహితులకు కానీ, సంబంధిత వ్యక్తులకు కానీ తెలపకుండా మానసిక ఆందోళనకు గురవుతున్నట్టు తెలిసింది. తీవ్రంగా మనస్థాపం చెందిన రమేష్ ఇవాళ తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకొని బలవన్మరానికి పాల్పడ్డాడు. అయితే ఇంటి సూరు శబ్దం వినిపించినట్టు కావడంతో కుటుంబ సభ్యులు లేచి చూసే వరకే రమేష్ మృతి చెందాడు. రమేష్ మృతదేహాన్ని సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతునికి భార్య బాలమణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పెద్దూరులో తీవ్రవిషాదాన్ని నింపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement