Sunday, April 28, 2024

Ap: విధుల్లో చేరిన అంగన్వాడీలు

అంగన్‌వాడీలతో ఏపీ సర్కార్‌ చర్చలు సఫలం కావడంతో విధుల్లోకి అంగన్‌వాడీలు చేరారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12వ తేదీ నుంచి వీరు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ నుంచి వేతనాలు పెంచేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు.

11 డిమాండ్లలో ఇప్పటికే 10 డిమాండ్ల అమలుకు కార్యాచరణ చేపట్టింది జగన్‌ సర్కార్‌. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ భారీగా పెంచింది ఏపీ ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement