Wednesday, May 1, 2024

Flash: నెల్లూరుకు చేరుకున్న గౌతమ్ రెడ్డి పార్ధివదేహం.. ఇంటి వద్ద విషాదఛాయలు..

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహం ఇప్పుడే డైకస్ రోడ్డులోని ఆయన నివాసానికి చేరింది. అభిమానులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో మంత్రి నివాసం కిటకిటలాడుతోంది. మంత్రి పార్ధివదేహాన్ని చివరిసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు తరలివస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు మంత్రి గౌతమ్ రెడ్డికి నివాళులర్పించేందుకు విచ్చేశారు.

కాగా, హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్‌లో గౌతమ్‌ రెడ్డి పార్ధివదేహాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు. ఇప్పటికే గౌతమ్‌ రెడ్డి ఇంటి దగ్గర విషాదఛాయలు అలుకుకున్నాయి. గౌతమ్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అభిమానుల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివస్తున్నారు. రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు నెల్లూరు చేరుకోనున్నారు. రేపు అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement