Thursday, April 18, 2024

Crime: పోలీస్ స్టేషన్ భవనంపై వ్యక్తి దారుణ హత్య

ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. మృతుడు శివాలాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానికులు, ములుగు సిఐ డి.శ్రీధర్ తెలిపిన కథనం ప్రకారం.. ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ లో పని నిమిత్తం మధ్యప్రదేశ్లోని బాలగట్ ప్రాంతానికి చెందిన యూకె. శివాలాల్ తోపాటు మరో 25 మంది కూలీలతో కలిసి పని చేస్తూ ఉండేవాడన్నారు. గత రెండు రోజులుగా మిగతా వారితో కాకుండా అతడు ఒక్కడే బిల్డింగ్ పై అంతస్తులో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో హత్యకు గురైయ్యాడు. అయితే, తోటి కూలీలే దారుణంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement