Wednesday, May 15, 2024

AP | విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగింపు !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. సంక్రాంతి సెల‌వుల‌ను ప్ర‌భుత్వం పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 18 గురువారం వ‌ర‌కు మాత్ర‌మే ఉన్న సంక్రాంతి సెలవులను మ‌రో మూడు రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తి మేర‌కు మ‌రో మూడు రోజుల పాటు సెల‌వుల పొడిగింపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్ తెలియ‌జేశారు. దీంతో పాఠ‌శాల‌లు జ‌న‌వ‌రి 22 సోమ‌వారం రోజున పునఃప్రారంభం కానున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement