Wednesday, May 15, 2024

సొంతూరికి వెళుతూ.. అనంత‌లోకాల‌కు..

జూపాడు బంగ్లా, (ప్రభా న్యూస్): క‌ర్నూలు జిల్లాలో ఘోరం జ‌రిగింది. బైకుపై సొంతూరుకు వెళ్తున్న ఇద్ద‌రు యువ‌కుల ప్రాణాల‌ను బ‌స్సు బ‌లిగొన్న ఘ‌ట‌న ఇవ్వాల జ‌రిగింది. ప్రకాశం జిల్లా వినుకొండ తాలూకా వెంటాకు చెందిన నాంచారి (25), మల్లికార్జున (23) ద్విచక్ర వాహనంపై సొంత ఊరికి వెళుతున్నారు.

క‌ర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం జూపాడుబంగ్లా కేసీ కాల్వ వంతెన వద్ద విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ ఐ వెంకటసుబ్బయ్య యువకుల మృతదేహాలను గుర్తించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement