Sunday, April 28, 2024

Tirumala: 15న తిరుమ‌ల‌లో గోదాదేవి క‌ల్యాణం …

తిరుమల‌లో 15న తిరుపతిలో గోదాదేవి కల్యాణం, 16న పార్వేటీ ఉత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్ల‌డించారు.. తిరుమ‌ల‌లో నేటి ఉద‌యం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 25న రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా నిర్వ‌హిస్తామ‌న్నారు.

ధర్మ ప్రచారంలో భాగంగా మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సు నిర్వహించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 60 నుంచి 70 మంది స్వామీజిలను సదస్సుకు ఆహ్వానిస్తాని ఈవో తెలిపారు. ఇక అన్నప్రసాదంలో వినియోగించే బియ్యాన్ని మిల్లర్లు ద్వారా కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.

డిసెంబ‌ర్ నెల‌లో 19.16 లక్షల మంది భ‌క్తుల‌కు శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం ..
డిసెంబర్‌ నెలలో శ్రీవారిని 19.16 లక్షల మంది భ‌క్తులు దర్శించుకున్నారు..ఇక హుండీ కానుకల రూపంలో రూ.116.73 కోట్లు స్వామి వారి ఖ‌జ‌నాకు చేరాయి. భ‌క్తులు ఏకంగా ఒక కోటి 46 వేల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని కొనుగోలు చేశారు. 40.77 లక్షల మంది భ‌క్తులు స్వామి వారిఅన్నప్రసాదం స్వీకరించారు. తలనీలాలు 6.87 లక్షల మంది స్వామి వారికి స‌మ‌ర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement