Thursday, May 2, 2024

Ship hijacked: భార‌త‌సిబ్బంది ఉన్న నౌక హైజాక్‌… రంగంలోకి ఇండియ‌న్ నేవి..

15 మంది భారత సిబ్బంది ఉన్న నౌక‌ను సోమాలియా తీరంలో హైజాక్ చేసినట్లు సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. హైజాక్కి సంబంధించిన సమాచారం అందుకున్న తర్వాత ఇండియన్ నేవీ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

హైజాక్ అయిన ఎంవీ లిలా నోర్ఫోక్ నౌకపై నిఘా ఉంచేందుకు ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్‌ చెన్నై పరిస్థితిని పరిష్కరించడానికి హైజాక్ చేసిన ప్రాంతానికి వెళుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement