Friday, May 17, 2024

ఒక్క ఫొటో కోసం వనపర్తి నుంచి.. నీ అభిమానం స‌ల్ల‌గుండ‌..

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుతో ఫొటో దిగేందుకు తెలంగాణ నుంచి ఓ యువకుడు పని గట్టుకుని ఆంధ్ర‌ప్ర‌ప‌దేశ్ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన జంగా శ్రీవర్థన్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు. మాజీ సీఎం చంద్రబాబుకు పెద్ద అభిమాని అయిన శ్రీవర్ధన్ చాలాకాలంగా అయనను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును కలిసి ఒక్క ఫొటో దిగాలనేది శ్రీవర్థన్ కోరిక. దీని కోసం త‌న దోస్తుల‌ను వెంటబెట్టుకుని శ్రీవర్థన్ అమరావతి వచ్చారు.

నిన్నవిజయవాడ చేరుకున్న శ్రీవర్ధన్ చంద్రబాబు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలుసుకుని సెంట్రల్ ఆఫీస్ కు వచ్చారు. ఈ విషయంలో తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది టీడీపీ అధినేతకు శ్రీవర్థన్ గురించి వివరించారు. దీంతో చంద్రబాబు శ్రీవర్ధన్ తో ఫొటో దిగడమే కాకుండా కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడారు. అతని యోగక్షేమాలు తెలుసుకుని అభినందించారు. చంద్రబాబుతో సెల్ఫీ కూడా తీసుకున్న శ్రీవర్ధన్ దీనికోసమే వచ్చాను సర్ అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement