Sunday, April 28, 2024

వైఎస్ ఆర్ కాంగ్రెస్ కి నాలుగేళ్లు.. కేక్ క‌ట్ చేసిన ఎంపీ డాక్టర్ గురుమూర్తి

తిరుపతి సిటీ ప్రభ న్యూస్ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ గురుమూర్తి కార్యాలయంలో నాయకులు.. కార్యకర్తలు కేక్ కట్ చేశారు. అనంత‌రం పార్టీ కార్యకర్తలకు ఎంపీ డాక్టర్ గురుమూర్తి కార్యాలయంలో స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని విజయాన్ని అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా రంజక పాలన అందిస్తున్న జ‌గ‌న్ మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని 2024లో కూడా గతంలో కంటే ఎక్కువ మెజార్టీ రావడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వ మిగిలిన సమస్యలను తెలుసుకునేందుకు కూడా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమం అభివృద్ధి తెలియజేయడంతో పాటు సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించేందుకు ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ప్రజలు చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజలు పట్టడం కడతారని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పడిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉండి విజయానికి సైనికుల్లాగా నడుము బిగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement