Friday, March 29, 2024

పాద యాత్ర చేస్తా… సీఎం పదవి వెతుక్కుంటూ వ‌స్తుంది – కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ: తాను కూడా పాద‌ యాత్ర చేపట్టనున్నట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అలాగే తనకు సీఎం పదవి అవసరం లేదంటునే , ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్బంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో సత్కరించి ,కేట్ చేయించారు అభిమానులు . అనంతరం కోమడిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామని ప్రకటించారు. జూన్ లో ప్రియాంక గాంధీ నల్గొండకు వస్తారని చెప్పారు. తన బర్త్ డే వేడుకలు బల ప్రదర్శనకు వేదిక కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుండి పోటీ చేయనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుండి పోటీ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement