Friday, April 26, 2024

భీమ‌వ‌రం ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. న‌లుగురిని అరెస్టు చేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులను పోలీసులు ఇవ్వాల (శ‌నివారం) అరెస్టు చేశారు. ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కళాశాల క్యాంపస్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో నివసిస్తున్నారు. విద్యార్థులు హాస్టల్ గదిలో తోటి విద్యార్థిపై కర్రలు, పీవీసీ పైపులతో దాడి చేసిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాడిచేసిన వ్యక్తులు కర్రలతో కొడుతూ ఉండగా బాధితుడు వేడుకుంటూ క్షమాపణలు చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో బాధితుడు అంకిత్‌ గాయాలతో ఆసుపత్రిలో చేరాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ప్రవీణ్, ప్రేమ్, స్వరూప్, నీరజ్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగిందని, శనివారం వీడియో ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపారు. విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నప్పటికీ కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement