Sunday, April 28, 2024

AP: వైసిపికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గుడ్ బై

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. తనకు వైసీపీ పార్టీలో తీవ్ర అన్యాయం, అవమానం జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తామని జగన్ మోసం చేశారని ఆరోపించారు.

తనకు వైసీపీ పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో మళ్లీ బాధ్యతల నుంచి ఎందుకు తొలగించారో తనకు తెలియదన్నారు. తనకు పదవి కంటే గౌరవం ముఖ్యమని, గౌరవం ఎక్కడ దొరికితే అక్కడకు వెళతానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement