Sunday, April 28, 2024

AP : వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జ‌న‌సేన‌కు షాక్‌ తగిలింది. కీలక నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి ఇవాళ‌ వైసీపీలో చేరారు. సీఎం జ‌గ‌న్‌ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు సీఎం జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

2004, 2009 పి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు పాముల రాజేశ్వరి. అయితే…2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పాముల రాజేశ్వరి. ఇక గత కొద్ది కాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు పాముల రాజేశ్వరి. ఈ తరుణంలోనే… పాముల రాజేశ్వరిని ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకుని వెళ్లారు అమలాపురం వైసిపి పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్. ఈ సందర్భంగా వైసీపీలో చేరారు పాముల రాజేశ్వరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement