Friday, April 26, 2024

తిరుమ‌ల శ్రీవారి స‌ర్వ ద‌ర్శ‌నానికి.. ఎనిమిది గంట‌లు

తిరుమ‌ల శ్రీవారి స‌ర్వ ద‌ర్శ‌నానికి ఎనిమిది గంట‌ల స‌మ‌యం ప‌డుతోంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 65,466 మంది భక్తులు దర్శించుకోగా 26,174 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.29 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement