Monday, May 6, 2024

నేడు ఏపీ కేబినెట్ స‌మావేశం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గం ఈరోజు భేటీ కానుంది. సచివాలయంలో ఈ ఉదయం 11 గంటలకు కేబినెట్ స‌మావేశం జరగనుంది.
ఇందులో భాగంగా మొత్తం 32 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జనవరిలో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆమోదం తెలపనుంది. మాండూస్ తుపాను పరిహారం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపిన పెట్టుబడులకు మంత్రివర్గం ఇవ్వనుంది. అలాగే ప‌లు అంశాల‌పై కేబినెట్ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement