Sunday, April 28, 2024

అబ్బాస్ కు మొదటి రుణ విముక్తి పత్రం అందచేత

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథ‌కంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్న లబ్ధిదారులకు ఇచ్చే రుణ విముక్తి పత్రాన్ని మొట్టమొదటి గా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామానికి చెందిన మీర్ కాల్బె అబ్బాస్ కు అధికారులు అందచేశారు. రూరల్ పెర్మినెంట్ హౌస్ (2006) లో 17,500 రూపాయలు రుణం పొందిన అబ్బాస్ శుక్రవారం నగరం సచివాలయం -1 లో ఓటీఎస్ పథకం లో భాగంగా 10 వేలు చెల్లించి లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందారు. ఈ కార్యక్రమంలో డీఈఈ ఎమ్ జీకే నాగరాజు,ఏఈ కె.సూర్యప్రకాష్ రావు,వర్క్ ఇన్స్పెక్టర్లు ఏ.జగదీష్, జె.శ్రీనివాసరావు,డిజిటల్ అసిస్టెంట్ ఎస్ .నాగమణి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ కిరణ్,వీఆర్వో త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement