Monday, April 29, 2024

Fire Brand – పురందేశ్వ‌రిపై రోజా ఫైర్… తండ్రికి ఒక్క‌పూట అన్న‌పెట్ట‌ని కుమార్తె అంటూ విమ‌ర్శ‌

న‌గ‌రి – టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరిపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌గ‌రిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఒక రోజు అయినా అన్నం పెట్టి.. నీళ్ళు ఇచ్చావా పురంధేశ్వరి అంటూ ప్రశ్నించారు. పురందరేశ్వరి ఒక జగత్ కిలాడీ.. బావ కళ్లులో ఆనందం కోసం లేఖలు రాస్తోంది.. పురంధేశ్వరి లాంటి నీతి మాలినా, జగత్ కిలాడి లాంటి కూతురు ఎవరికి పుట్టకూడదని కోరుకుంటున్నాను.. పురంధేశ్వరి లాంటి కూతురు పుట్టిందని ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఎడుస్తుంటారు అంటూ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. .చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టిన రెయిన్ గన్ స్కీమ్ ను ప్ర‌స్తావిస్తూ, రెయిన్ గన్ లతో ఎక్కడైనా కరువు జయించగలమా..రెయిన్ గన్ తో వేలాది ఎకరాలు పండించగలమా.. రెయిన్ గన్ విషయంలో కూడా చంద్రబాబుపై కేసులు పడతాయి.. జైలుకు పోతాడు అని ఆమె పేర్కొన్నారు. రైతు ద్రోహి చంద్రబాబు.. అంటూ రోజా రెచ్చిపోయారు..

సీఎం జగన్ కేసులపై కక్ష సాధింపులో భాగంగా సుప్రీంకోర్టుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాశారు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పురంధేశ్వరి అమె పని అమె చూసుకుంటే చాల‌ని, జగన్ కేసుల గురించి లేఖలు రాయల్సిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. జగన్ తన కేసులను విచారించాలని పిటీషన్ పెట్టుకున్న దమ్మున్న నాయకుడు జగన్ అని అన్నారు..పురంధేశ్వరికి ఒక నియోజకవర్గం లేద‌ని, .. ఆమెను చూసి ఓటు వేసే వాళ్ళు ఎవరు అంటూ మంత్రి రోజా సెటైర్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement