Friday, May 3, 2024

Big Breaking | కాకినాడ తీరంలో అగ్ని ప్రమాదం.. మంటల్లో 40 బోట్లు

ఏపీలోని కాకినాడ తీరంలో ఇవ్వాల (శుక్రవారం) రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం కోరంగిలో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఫైబర్​ బోట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. దీంతో 40 బోట్లకు పైగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలసుకుని హుటాహుటిన ఫైర్​ సర్వీస్​ అధికారులు తరలివచ్చారు. సిబ్బంది స్థానికులతో కలిసి మంటలు ఆర్పేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement