Monday, April 29, 2024

AP: ఆర్థిక అవకతవకలు.. సీఎం జగన్‌ సహా 41 మందికి హైకోర్టు నోటీసులు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎం జగన్‌ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది.

రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు 41మందికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement