Monday, April 29, 2024

Peddapalli: సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్… ఎమ్మెల్యే దాసరి

ఓదెల (ప్రభ న్యూస్) : సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మూడోసారీ భంగపాటేనని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఓదెల మండలం గుంపుల గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రజలు మరోసారి నమ్మి ఓట్లు వేస్తారన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లిలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీ లేని పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా, 60 గ్యారంటీలు ఇచ్చినా.. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.

ప్రపంచంలో ఎక్కడా కూడా కేసీఆర్ అందిస్తున్న పథకాలు లేవన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, కేసీఆర్ కిట్టు, జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ వంటివి ఒక్కటి కూడా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు. ఇంటింటా ప్రచారంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ వైస్ ఛైర్మెన్ ఐరెడ్డి వెంకట్ రెడ్డి, ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఆళ్ల రాజిరెడ్డి, ఆకుల మహేందర్, మండల యూత్ అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్, సర్పంచ్ తిప్పారపు చిరంజీవి, మాజీ సర్పంచ్ ఉప్పుల సంపత్, ఉప సర్పంచ్ గట్టు మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మడ్డి శ్రీనివాస్, రాజుల కిషన్, యూత్ బొమ్మక నరేష్, నాయకులు గాదం శ్రీనివాస్, బొమ్మ అశోక్, మర్రి కుమార్, కోసున సదానందం, ఇట్టెం శ్రీనివాస్, ఇనుముల గణేష్, సర్వ సంపత్, మ్యాదరి సంపత్, గోవింద్ రెడ్డి, సాగర్ల లింగయ్య, మేకల రాములు బండారి రమేష్, బండారి తిరుపతి, సూత్రాల లింగయ్య, బండారి మల్లయ్య, నాడెం వెంకన్న, మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement