Saturday, May 18, 2024

Fiber net case ..పీటీ వారెంట్‌కు అనుమతి.. చంద్ర‌బాబుని సోమవారం కోర్టులో హాజరు పరచాలని ఆదేశం

విజయవాడ: ఫైబర్‌నెట్‌ కేసులో పీటీ వారెంట్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును సోమవారం వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని న్యాయ‌మూర్తి తీర్పు వెలువరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబుకు ఈనెల 19 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును సోమవారం వ్యక్తిగతంగా హాజరుపర్చాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement