Saturday, May 4, 2024

NZB: యువకుడి ఆత్మహత్య కలకలం..

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 12 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. నిజామాబాద్ నగరంలోని ఆదర్శ నగర్ ప్రాంతానికి చెందిన రాపల్లి వెంకట్ (35) అనే యువకుడు బుధవారం రాత్రి కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవాళ ఉదయం సమాచారం తెలుసుకున్న మూడవ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి… వెంకట్ మూడు సంవత్సరాల క్రితం వినాయక్ నగర్ కు చెందిన ఉషా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవ పడి భార్య తల్లిగారింటికి వెళ్ళింది. ఆరు నెలల క్రితం తల్లి మరణించగా, కట్టుకున్న భార్య లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం రాత్రి కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement