Sunday, May 5, 2024

విజ‌య‌వాడ డివిజ‌న్ లో 23వ తేది వ‌ర‌కు ప‌లు రైళ్లు ర‌ద్దు..

అమరావతి : విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్యే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 17 నుంచి 23 వరకు కాకినాడ నుంచి విశాఖకు వెళ్లే ప్యాసింజర్‌ స్పెషల్‌ రైలు, రాజమండ్రి నుంచి విశాఖ ప్యాసింజర్‌, ఈ నెల 23 వరకు విశాఖ నుంచి విజయవాడకు వచ్చే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు.

ఈ నెల 18, 21, 22న ధన్‌బాద్‌-అలెప్సీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ రైలును,ఈ నెల 21న టాటానగర్‌-ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల దారిని మళ్లిస్తున్నట్లు వివరించారు.ప్రయాణికులు రైళ్ల రద్దు, దారి మళ్లింపును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement