Friday, April 26, 2024

నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్

నకిలీ విత్తనాల కారణంగా దిగుబడిని కోల్పొయిన పత్తిపంటను పరిశీలించారు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. ఆయన నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేశారు. కల్లూరు మండంలంలో పత్తి పంట పరిస్థితిని పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ప్రజాప్రతినిధులు కూడా కంపెనీల వారితో కుమ్మక్కై తమను దగా చేశారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారని చంద్రబాబు వివరించారు.ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు… రాష్ట్రమంతటా పత్తి రైతులది ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు. ఎకరాకు రూ.35 వేలకు పైనే పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం కష్టం అంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో, నకిలీ విత్తనాల సరఫరాదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement