Sunday, May 5, 2024

Exclusive : నెల్లూరు జంట హ‌త్య‌ల కేసులో వీడిన మిస్ట‌రీ.. వంట మనిషే మ‌ర్డ‌ర‌ర్‌

నెల్లూరు జిల్లాలో మొన్న జ‌రిగిన భార్య భ‌ర్త‌లు వాసిరెడ్డి కృష్ణారావు, సునీత‌ హ‌త్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హ‌త్య‌లు చేసింది వారి హోట‌ల్‌లో ప‌నిచేసు వంట మ‌నిషేన‌ని విచార‌ణ‌లో తేలింది. హోట‌ల్‌లో రొట్టెలు చేసేట‌ప్పుడు మాడిపోయాయ‌ని య‌జ‌మాని కొట్టిన‌ట్టు తెలుస్తోంది. దీన్ని మ‌నుసులో పెట్టుకుని వారిపై ప‌గ పెంచుకున్న‌ట్టు పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది.

అంతేకాకుండా భార్యా భ‌ర్త‌ల‌ను చంపేస్తే హోట‌ల్ త‌న సొంతం అవుతుంద‌ని, తానే ఇబ్బంది లేకుండా న‌డుపుకోవ‌చ్చ‌ని వంట‌మ‌నిషి ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మొన్న రాత్రి ముందు హోట‌ల్ య‌జ‌మాని భార్య‌ను చంపేసి, ఆ త‌ర్వాత హోట‌ల్ య‌జ‌మాని కృష్ణారావుని చంపేసిన‌ట్టు తెలుస్తోంది.  దీనికి సంబంధించి ఇవ్వాల సాయంత్రం పోలీసులు మీడియా స‌మావేశం నిర్వ‌హించి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement