Friday, April 26, 2024

యాదాద్రికి అరుదైన గుర్తింపు- ఆల‌యం ఫొటోతో క‌వ‌ర్ రిలీజ్ చేసిన త‌పాలాశాఖ‌

త‌పాలాశాఖ యాదాద్రి ఆల‌య ఫొటోతో పోస్ట‌ల్ క‌వ‌ర్ రిలీజ్ చేసింది. తెలంగాణ‌లో ఈ గుర్తింపు పొందిన తొలి ఆల‌యం యాదాద్రి కావ‌డం విశేషం.. యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి దేవు సిన్హు చౌహన్ భువనగిరి పోస్ట్ ఆఫీసులో యాదాద్రి ఆలయంతో ఉన్న పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసింది.
ఈ స్పెషల్ కవర్ పై యాదాద్రి ఆలయం ఏరియల్ వ్యూను ముద్రించారు. ఆలయానికి సంబంధించిన వివరాలతో బ్రోచర్ ను కూడా ఈ కవర్ పై ముద్రించారు. యాదాద్రి ఆలయం పై స్పెషల్ కవర్ ను రిలీజ్ చేసే అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావన వేదాలు, స్కంద పురాణంలో ఉందన్నాడు. ఇటీవల యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. ఆలయ రెనోవేషణ్ కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం 39 కిలోల బంగారం, భారీ మొత్తంలో వెండిని ఉపయోగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement