Friday, April 26, 2024

సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల విచారణ

సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే  ధూళిపాళ్ల నరేంద్ర విచారణకు హాజరైయ్యారు. సంగం డెయిరీ కేసులో విచారణకు రావాలని ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. విజయవాడ సిటీ ఆర్మ్‌డ్ హెడ్ క్వార్టర్స్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఏసీబీ ఎదుట విచారణకు హాజరైయ్యారు.

కాగా, సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సంస్థ ఛైర్మన్ గా ఉన్న ధూళిపాళ్లను ఏసీబీ గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైల్ కు తరలించారు. అయితే, ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్​పై విచారణ చేసిన ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని, నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ.. ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: ఈనెల 15 నుంచి రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’ జమ

Advertisement

తాజా వార్తలు

Advertisement