Sunday, April 28, 2024

రైతుల గుండెల్లో గుబులురేపుతున్న విద్యుత్‌ మీటర్లు..

కర్నూలు, ప్రభన్యూస్ : ఇప్పటికే అన్న వర్గాలను టార్గెట్‌ చేసిన జగన్‌ సర్కారు… ఇప్పుడు రైతుల్ని టార్గెట్‌ చేసింది. విద్యుత్‌ మోటర్లకు మీటర్లు బిగించేందుకు రెడీ అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మోటార్లకు విద్యుత్‌ మీటర్లను బిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి విదితమే.

కనెక్షన్లు పెరిగినప్పటికీ దాదాపు 34 మిలియన్ల యూనిట్ల కరెంట్‌ ఆదా అయిందనీ ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ.. రాజకీయ లబ్ధి కోసమే మీటర్లు ఏర్పాటు అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఆ విమర్శలను తిప్పికొట్టి రైతులకు జరుగతున్న మేలును వివరించాలన్న తీరులో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement