Thursday, May 2, 2024

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: తలసాని

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న కానుక కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద 113 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఇది మనకెంతో గర్వకారణం అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement