Saturday, May 4, 2024

AP: పొలాల్లో ఎలక్ట్రిక్​ ఫెన్సింగ్.. నీరు తాగేందుకు వచ్చి జింక మృతి

నాయుడుపేట, (ప్రభన్యూస్​): తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో ఓ జింక చనిపోవడం ఆందోళన కలిగించింది. పుదూరు గ్రామ సమీపంలోని పొలాల వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. నాయుడుపేట- మల్లాం ఆర్ అండ్ బీ రహదారి పక్కన ఓ రైతు తన పొలంలోని నారుముడులను కాపాడుకునేందుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు.

అయితే.. అడవిలోంచి తప్పిపోయిన ఓ జింక దాహం తీర్చుకునేందుకు పొలాల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇట్లా అది పొలాలకు వేసిన విద్యుత్​ ఫెన్సింగ్​ని తాకి విద్యుత్​ షాక్​తో చనిపోయినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు కూడా స్థానిక గ్రామస్తులు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement