Sunday, March 17, 2024

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చు.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసిన మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

వైసీపీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు. శ్రీకాకుళం జిల్లా తన సొంత నియోజకవర్గ కేంద్రం పలాసలో మంగళవారం అప్పలరాజు నూతనంగా నిర్మించిన తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చంటూ అప్పలరాజు వ్యాఖ్యానించారు. కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నామని కూడా ఆయన వైసీపీ శ్రేణులను ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేశారు. వైసీపీని ప్రతిపక్షాలతో పాటు ఆ పార్టీలకు వంత పాడుతున్న మీడియా కూడా ఏమీ చేయలేవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement