Monday, May 13, 2024

గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్‌లో దారుణ ఘటన జరిగింది. 8వ తరగతి విద్యార్థి మంద కోటిస్వాములు గుండెపోటుతో కన్నుమూశాడు.. కాగా గత రాత్రి భోజనం చేసిన ఊపిరాడటం లేదని విద్యార్థి ఫ్రెండ్స్‌కి తెలిపాడు. దీంతో తోటి విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కోటిస్వాములు మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు దృవీకరించారు.. విద్యార్థి మరణ సమాచారాన్ని అతడి తల్లిదండ్రులకు అందించారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement