Friday, April 26, 2024

ఏపీ సర్కార్ లో రౌడీయిజం.. తారకరత్న

ప్రభుత్వంలో రౌడీయిజం పెరిగిపోయిందని నందమూరి తారకరత్న విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి హుకుంపేటలో జరుగుతున్న రైతుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తారకరత్న చెప్పారు. రైతులు నిస్వార్థంగా భూములు ఇచ్చారని.. వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement