Thursday, April 25, 2024

తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనం 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధ‌వారం స్వామివారిని 73420 మంది భ‌క్తులు ద‌ర్శించుకోగా.. 27621 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement