Sunday, May 5, 2024

మండపేట‌లో భారీ పేలుడు : న‌లుగురికి తీవ్ర‌గాయాలు

బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో భారీ పేలుడు ఘ‌ట‌న సంభ‌వించి న‌లుగురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మండపేట ఏడిద రోడ్డులో ఉన్న‌ బాణచాంచా తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు జరిగింది. బాణా సంచా తయారీ చేస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.క్షతగాత్రులలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement