Saturday, April 27, 2024

గాయ‌త్రీదేవి అలంకారంలో పంచ‌చ‌ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చిన దుర్గ‌మ్మ‌

దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. కాగా మూడ‌వ‌ రోజు దుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో పంచముఖాలతో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు విజయవాడకు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement