Tuesday, May 14, 2024

మ‌ద్యం తాగి లొల్లి చేస్తున్నాడ‌ని.. తండ్రిని హతమార్చిన తనయుడు

దుర్గి (ప్రభన్యూస్) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఇవ్వాల దారుణం జ‌రిగింది. దుర‌గ్ఇ మండల పరిధిలోని అడిగోప్పలలో కన్నకొడుకే తండ్రిని చంపేశాడు. ఎస్సై పాల్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చల్లా అంజయ్య (65) రోజూ మద్యం తాగి ఇంట్లో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విసుగుచెందిన అత‌ని కొడుకు చల్లా బ్రహ్మయ్య కొడవలితో తలపై బలంగా కొట్టాడు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంజయ్యను మాచర్ల తరలించే క్ర‌మంలో మార్గ మధ్యలో చనిపోయినట్లు తెలిపారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement