Tuesday, May 21, 2024

TTD | శ్రీవారి ట్రస్టులకు రూ.31 లక్షల విరాళం

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి : టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రాజమండ్రికి చెందిన డాక్టర్‌ నారాయణరాజ్‌ రూ.11 లక్షల 11 వేల 116, పశ్చిమగోదావరికి చెందిన వెన్న హరిబాబు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు సోమవారం విరాళంగా అందించారు. అదేవిధంగా ప్రముఖ గాయని దివంగత లతామంగేష్కర్‌ వీలునామా మేరకు ఆమె సోదరి ఉషామంగేష్కర్‌ రూ.10 లక్షలు టీటీడీ ట్రస్టులకు అందించారు. ఇందుకు సంబంధించిన డిడిని తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి దాతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శేషుబాబు, మిలింద్‌నవ్రేకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement