Friday, May 3, 2024

AP : పెన్షన్ల పంపిణీ ఆపొద్దు… చీఫ్ సెక్రటరీకి టీడీపీ నేత చంద్రబాబు లేఖ

(ఆంధ్రప్రభ, అమరావతి) : ఏపీలో వృద్ధులకు పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయటంతో.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని తన లేఖలో కోరారు.

- Advertisement -

ఆయన రాసిన లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వలంటీర్లతో పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలున్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి, వృద్ధులు, వింతంతువులు, ఇతర లబ్దిదారులకు నగదు రూపంలో పెన్షన్ చెల్లించాలి అని చంద్రబాబు కోరారు.

జాప్యం లేకుండా పెన్షన్ అందేలా చూడండి…

గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో సకాలంలో, ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలని, దీని కోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లాడానికి అనుమతించాలని చంద్రబాబు కోరారు. అసవరం అయిన అనుమతులు ఇవ్వాలని సూచించారు. పెన్షన్ పంపిణీకి అవసరం అయిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదు అనే వార్తలు వస్తున్నాయని, ఈ కారణంగా పెన్షన్ల పంపిణీకి నిధులు వెంటనే అందుబాటులో ఉంచాలని సూచించారు. గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5 తేదీ మధ్య పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని, చీఫ్ సెక్రటరీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా లేఖ రాశారు. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను చంద్రబాబు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement