Saturday, May 4, 2024

పుష్ప శ్రీవాణి ఎస్టీనే… స్పష్టతనిచ్చిన విచారణ కమిటీ

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సామాజిక వర్గంపై నెలకొన్న వివాదం పటాపంచలైంది. పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని విచారణ కమిటీ (డీఎల్ఆర్ సీ) తేల్చింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ సామాజిక వర్గమైన కొండదొర కులానికి చెందిన మహిళ అని కమిటీ నిర్ధారించింది. ఎన్నికల అఫిడవిట్లో పుష్ప శ్రీవాణి పొందుపరిచిన కులం నిజమేనని డీఎల్ఆర్ సీ ప్రకటించింది. పుష్ప శ్రీవాణి గిరిజనురాలు కాదంటూ గతంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోర్టు డీఎల్ఆర్ సీ విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ పుష్ప శ్రీవాణి గిరిజనురాలేనని స్పష్టం చేసింది.

కాగా, విజయనగరం జిల్లా కురుపాం(ఎస్టీ) నియోజవర్గం నుంచి పుష్ఫ శ్రీవాణి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె 2014,2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement